Thursday, May 2, 2024

ఆర్టీసీలో అదనంగా డీజిల్​ సెస్సు.. ఇవ్వాల్టి నుంచే పెంచిన చార్జీలు అమలు

తెలంగాణ ఆర్టీసీ మరోసారి బస్సు చార్జీల రేట్లను పెంచేసింది. డీజిల్ సెస్ పేరుతో ఈ వాయింపు ఉండనుంది. కిలో మీటరు లెక్కన దాదాపు అన్ని బస్సుల్లో చార్జీలు పెరగనున్నాయి. అయితే, హైదరాబాద్ లో మాత్రం సిటీ బస్సులకు మినహాయించారు. ఈ పెంపు ఇవ్వాల్టి నుంచే అమల్లోకి వచ్చింది. గత మార్చిలోనే డీజీల్ సెస్ పేరుతో దాదాపు రూ.2 నుంచి రూ.5 వరకూ పెంచారు. ఇప్పుడు కిలో మీటర్ల ప్రాతిపదికన డీజిల్ సెస్ ను పెంచుతున్నారు. ఈ పెంపుతో సగటున ఒక్కో ప్యాసింజర్ పైన రూ.20 వరకూ భారం పడనుంది. ఈ సెస్ పెంపు వల్ల ప్రయాణించాల్సిన కిలో మీటర్లు పెరిగితే చార్జీలు పెరుగుతాయి. లాంగ్ జర్నీలు చేసేవారికి మరింత భారం అవ్వనుంది.

బస్​ చార్జీల పెంపు ఇలా..
ఏసీ బస్సుల్లో 500 కిలో మీటర్ల పరిధిలో రూ.10 నుంచి రూ.170 పెరుగుదల
సూపర్ లగ్జరీ బస్సుల్లో 500 కిలో మీటర్ల పరిధిలో రూ.10 నుంచి రూ.130 పెరుగుదల
ఎక్స్ ప్రెస్ బస్సులో 500 కిలో మీటర్ల పరిధిలో కనిష్ఠంగా రూ.5 నుంచి రూ.90 పెరుగుదల
పల్లె వెలుగు బస్సులో 250 కిలో మీటర్లకు కనిష్ఠంగా రూ.5, గరిష్ఠంగా రూ.45 పెరిగింది

Advertisement

తాజా వార్తలు

Advertisement