Wednesday, May 8, 2024

విశాఖలో యువ డాక్టర్ ఆత్మహత్య

ఓ యువకుడు ఎంబీబీఎస్‌ పూర్తిచేశాడు.. ఆపై పీజీ చేయాలని కలలు కన్నాడు. కానీ ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. లక్ష్యం నెరవేరేటట్లు కనిపించకపోవడంతో విశాఖలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. అనకాపల్లికి చెందిన కె.రాజశేఖర్‌(32) చైనాలో ఎంబీబీఎస్‌ పూర్తిచేసి వచ్చాడు. అనకాపల్లిలో ఉంటూ పీజీ చేయాలని అనుకున్నాడు. అయితే ఆర్థిక సమస్యలు వెంటాడాయి. తండ్రి కూడా అనారోగ్యానికి గురయ్యారు. ఈ పరిస్థితుల్లో తను పీజీ చేసే దారి కనిపించక మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో మధురవాడ గణేష్‌ నగర్‌లో ఉంటున్న స్నేహితుడు సుబ్బరాజు ఇంటికి వచ్చాడు.

 స్నేహితుడు లేకపోవడంతో ఆయనకు ఫోన్‌ చేయగా.. తాను వచ్చే వరకు ఫ్లాట్‌లో ఉండమని చెప్పాడు. సుబ్బరాజు తన పని ముగించుకొని రాత్రి 11 గంటలకు వచ్చి ఫ్లాట్‌ తలుపు కొట్టగా ఎంతకీ తీయలేదు. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు తలుపు తీసి చూడగా.. రాజశేఖర్‌ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉన్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై హరికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీఎంపాలెం సీఐ ఎ.రవికుమార్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement