Sunday, April 28, 2024

Delhi : మెట్రో రైలు కింద పడి మహిళ మృతి

ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ప్రమాదం జరిగింది. కదులుతున్న రైలు కింద పడి మహిళ మృతి చెందింది.రీనా (35) అనే మహిళ ఇందర్‌లోక్ స్టేషన్‌లో ప్రమాదానికి గురైంది. ఆమె చీర ట్రైన్ తలుపుల మధ్య చిక్కుకుని కింద పడిపోయింది.

దాంతో రీనాకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు ఢిల్లీ మెట్రోస్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అనూజ్ దయాళ్ చెప్పారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నారు. వెస్ట్ ఢిల్లీలోని నాంగ్లోయ్ నుంచి మోహన్ నగర్ కు రైలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు మహిళ బంధువు విక్కీ తెలిపారు. తీవ్ర గాయాలైన రీనాను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రీనా మరణించింది. రీనా భర్త ఏడేళ్ల క్రితం చనిపోయినట్లు తెలుస్తోంది. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నట్లు బంధువులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement