Saturday, May 4, 2024

SOT Rides – కల్తీ పాల తయారి కేంద్రాలపై ఎస్వోటి దాడులు – ఇద్దరి అరెస్ట్

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి కల్తీ పాలు తయారు చేస్తున్న స్తావరాలపై భువనగిరి ఎస్వోటి పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో కల్తీ పాలు తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను భువనగిరి పోలీసులు పట్టుకున్నారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న వలిగొండ పాండు ,, గౌస్ కొండ గ్రామానికి చెందిన అస్గర్ లను భువనగిరి ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .

వారి వద్ద నుండి 350 లీటర్ల కల్తీ పాలు, 2లిటర్స్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 11 డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు వీరిద్దరిని స్థానిక భూదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్ లోకి అప్పజెప్పి కల్తీ పాలను టెస్టు నిమిత్తం ల్యాబ్ కు పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement