Monday, May 13, 2024

భర్త గొంతుకోసి చంపేసిన భార్య.. ఎందుకో తెలుసా?

మద్యం, మత్తు పదార్థాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి నిత్యం భార్యను వేధించేవాడు. దీంతో చాలా రోజులుగా భరిస్తూ వచ్చిన ఆమె ఇక విధిలేని పరిస్థితుల్లో అతని గొంతుకోసి చంపేసింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం భరత్పూర్లో జరిగింది. నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో జరిగిన హత్య విషయంలో పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడు (30) జితేంద్రగా పోలీసులు గుర్తించారు. అయితే అతను మద్యానికి బానిసై భార్య దీప (28)ను హింసకు గురిచేసేవాడని తెలిసింది. రోజు మాదిరిగానే మొన్న బాగా తాగి వచ్చిన భర్తకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ అందించింది. అతి తాగి స్పృహ లేకుండా పడిపోయిన అతనిని గొంతుకోసం చంపేసింది.

అయితే.. డెడ్‌బాడీ దొరికినప్పటి నుండి అతని భార్య దీప యాక్టివిటీస్ అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు ఆమెపై నిఘా పెట్టారు. దీంతో భయాందోళనకు గురైన ఆమె పోలీసులపై అరుస్తూ.. ఈ కేసులో తనను అరెస్టు చేయాలని కోరింది. దీంతో దీపను అదుపులోకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేపట్టగా.. తన భర్తను ఎలా.. ఎందుకు చంపిందనే విషయాన్ని పోలీసులకు పూసగుచ్చినట్టు వెల్లడించి.. నేరాన్ని అంగీకరించింది. తన భర్త మద్యానికి అలవాటు పడి.. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటూ ప్రతిరోజూ తనపై దాడి చేసేవాడని.. ఆ హింస భరించలేకే తాను అతని గొంతుకోసం చంపేసినట్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement