Sunday, May 5, 2024

వింబుల్డన్​ మెన్స్​ సింగిల్స్​… క్వార్టర్‌ ఫైనల్స్‌కు నాదల్‌, హలెప్‌

వింబుల్డన్‌ మెన్స్‌ సింగిల్స్‌ విభాగంలో ప్రఖ్యాత క్రీడాకారుడు రాఫెల్‌ నాదల్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్‌ ఫైనల్స్‌కు నాదల్‌ చేరడం ఇది ఎనిమిదోసారి. నాలుగో రౌండ్‌లో వాన్‌ డ జండ్షుల్ప్‌ పై 6-4,6-2,7-6 తేడాతో నాదల్‌ విజయం సాధించాడు. అమెరికాకు చెందిన 11వ సీడ్‌ ఆటగాడు టైలర్‌ ఫ్రిట్జ్‌తో క్వార్టర్‌ ఫైనల్స్‌లో వచ్చే వారం తలపడనున్నాడు.

కాగా మహిళల సింగిల్స్‌ విభాగంలో సిమోనా హలెప్‌ సంచలనం సృష్టించింది. వరల్డ్‌ నెంబర్‌ 4 క్రీడాకారిణి పౌలా బడోసాపై విజయం సాధించి క్వార్టర్‌ పైనల్స్‌కు దూసుకెళ్లింది. 2019లో నుంచి వింబుల్డన్‌లో ఆడుతున్న ఆమె ఈసారి మంచి ఆటతీరుతో రాణించింది. పౌలాపై 6-1, 6-2 తో వరుస సెట్లలో విజయం సాధించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement