Friday, May 3, 2024

పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు.. మంత్రి జయరాం

ఆలూరు : పార్టీలకు, కుల మతాలకు అతీతంగా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పెద్దహోత్తుర్ గ్రామంలో గడపగడపకు మన కార్యక్రమాన్ని సర్పంచ్ లక్ష్మన్న ఆధ్వర్యంలో మంత్రి గుమ్మనూరు జయరాం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందజేయడమే తమ లక్ష్యమ‌న్నారు. గత మూడు సంవత్సరాలు గ్రామానికి 21 కోట్ల 65 లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. ప్రతి గ్రామానికి సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి ప్రతి ఒక్కరికీ, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి శాయాశక్తులా తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నార‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement