Saturday, May 18, 2024

పెద్దపల్లికి బయల్దేరిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లికి బయల్దేరారు. ఈ పర్యటనలో.. పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ భవనంను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదేవిధంగా అక్కడే లక్ష మందితో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు ఆరేళ్ల కిందట జిల్లాగా ఆవిర్భవించిన పెద్దపల్లిలో మరో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం అందుబాటులోకి రానుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు నూతన కలెక్టరేట్ ను ప్రారంభించనున్నారు. 2016 అక్టోబరు 11న దసరా పండుగ రోజున రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఆవిర్భవించాయి. పౌర సేవలను సత్వరంగా అందించి మెరుగైన పాలన నిర్వహణలో భాగంగా పెద్దపల్లిలో సమీకృత పాలనా ప్రాంగణానికి 2017 అక్టోబర్ 11న అప్పటి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement