Saturday, May 4, 2024

వ‌రంగ‌ల్ లో విజ‌య‌గ‌ర్జ‌న.. స్థ‌లాన్ని ప‌రిశీలించిన మంత్రి..

వ‌రంగ‌ల్ లో విజ‌య‌గ‌ర్జ‌న స‌భ నిర్వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు టిఆర్ ఎస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు స‌భ‌ని నిర్వ‌హించేందుకు స్థలాన్ని పరిశీలిస్తున్నారు.సభ ఎక్కడ నిర్వహించాలన్న దానిపై గత కొన్ని రోజులుగా ఇప్పటికే న‌గ‌రంలోని మడికొండ, ఉనికిచర్ల, ఉర్సు రంగ లీలా మైదానం సమీపంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి అవుతున్న సందర్భంగా నవంబర్ 15న వరంగల్‌లో విజయ గర్జన సభ నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే.

టీఆర్ఎస్ పార్టీ విజ‌య గ‌ర్జన స‌భ‌ను దాదాపు 10ల‌క్షల మందితో విజ‌య‌వంతం చేయ‌డానికి కసరత్తు చేస్తున్నారు. ఎలాంటి ఆటంకాలు క‌లగ‌కుండా అన్ని హంగులతో సభ నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. టీఆర్ఎస్ స్థాపించి 20 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ..పార్టీ సాధించిన విజయాలు, ప్రభుత్వం సాధించిన ప్రగతిని కేసీఆర్ పార్టీ శ్రేణులు, ప్రజలకు నివేదిస్తారని మంత్రి ఎర్రబెల్లి వెల్ల‌డించారు. దాంతో మంత్రి ఎర్రబెల్లి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌తో కలసి రాంపూర్ సమీపంలోని స్థలాన్ని కూడా పరిశీలించి.. అక్కడి రైతులతోనూ మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement