Friday, April 26, 2024

స‌మ‌ర్థుడికి ఓటు వేయండి.. పిలుపునిచ్చిన కిష‌న్ రెడ్డి..

నేడు జరిగే ఉప ఎన్నికలో ఓట్లు వేసేందుకు ప్రజలు భారీగా తరలి రావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ లో పిలుపునిచ్చారు. ఉన్నతమైన పాలన కోసం సమర్థుడికి ఓటు వేయాలని సూచించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కిష‌న్ రెడ్డి ట్విట్ట‌ర్ లో స్పందించారు. కాగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పీఆర్ఓ చైతన్య నెంబర్ ప్లేట్ లేని వాహనంలో తిరుగుతున్నాడ‌ని మర్రిపల్లిగూడెంలో అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు స‌మాచారం. ఇక హుజూరాబాద్ టౌన్ లో హనుమాన్ ఆలయం వద్ద డబ్బులు పంచుతున్న ఓ వ్యక్తిని బీజేపీ నేతలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడు హుజూరాబాద్ కు చెందిన వ్యక్తి కాడని బీజేపీ శ్రేణులు తెలిపారు. తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ శశాంక్ గోయల్ హుజూరాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ లను పరిశీలించారు. మొత్తానికి హుజురాబాద్ ఎన్నిక‌లు స‌జావుగా కొన‌సాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement