Friday, April 26, 2024

కోవిడ్ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో కోహ్లీ..

క‌రోనా కార‌ణంగా ఐపీఎల్ వాయిదా ప‌డ‌టంతో వెంట‌నే కొవిడ్ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో మునిగిపోయాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. అహ్మ‌దాబాద్ నుంచి ముంబై వెళ్లిపోయిన కోహ్లి.. ఏమాత్రం స‌మ‌యం వృథా చేయ‌కుండా కొవిడ్ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యాడు. ఈ విష‌యాన్ని యువ‌సేన స‌భ్యుడు రాహుల్ క‌నాల్ ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. కోహ్లి త‌మ‌తో క‌లిసి ప‌ని చేస్తున్నాడ‌ని చెబుతూ ఫొటోల‌ను షేర్ చేశాడు. ఇప్ప‌టికే కోహ్లి భార్య అనుష్క శ‌ర్మ కూడా కొవిడ్ స‌హాయక చ‌ర్య‌ల్లో పాలుపంచుకుంటోంది. గ‌తేడాది కొవిడ్ తొలిసారి విరుచుకుప‌డిన స‌మ‌యంలో పీఎం కేర్స్‌తోపాటు మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ఇచ్చాడు. అవ‌స‌ర‌మైన వాళ్ల‌కు పీపీఈ కిట్ల‌ను అందించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement