Saturday, May 4, 2024

ఈనెల 9న వినాయక నిమజ్జనం : ఉత్సవ సమితి

ఈనెల 9వ తేదీననే వినాయక నిమజ్జనం జరుగుతుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తెలిపింది. వినాయక నిమజ్జనంపై కొన్ని దుష్టశక్తులు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. హిందూ పండుగలపై ఆంక్షలు పెట్టాలని చూస్తున్నాయని ఉత్సవ సమితి తెలిపింది. భక్తుల మనోభావాలను ప్రభుత్వం దెబ్బ తీస్తోందని, అసెంబ్లీలో హిందూ ఎమ్మెల్యేలంతా మాట్లాడాలని పేర్కొంది. నిమజ్జనాలపై ప్రభుత్వం చట్టం చేయాలని, నిమజ్జనాల వల్ల హుస్సేన్ సాగర్ కలుషితం కావడం లేదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement