Saturday, April 27, 2024

మునిగిన ప‌డ‌వ‌… గంగాన‌దిలో ప‌ది మంది గ‌ల్లంతు..

బీహార్‌లోని పట్నా సమీపంలోని దానాపూర్ వద్ద సుమారు 55 మంది ప్రయాణిస్తున్న పడవ గంగానదిలో బోల్తాపడింది. గంగాహర ద్వీపంలో కూలి పనులు ముగించుకుని సొంతూర్లకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘ‌ట‌న‌లో సుమారు పది మంది కనిపించకుండా పోయారని, మిగిలినవారు క్షేమంగా బయటపడ్డారని వెల్లడించారు. గల్లంతైన వారి కోసం నది మొత్తం జల్లెడ పట్టినప్పటికీ ఆచూకీ లభించలేదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement