Monday, April 29, 2024

French Open | క్వార్టర్స్ లో విజయం.. సెమీస్‌లోకి భారత్ జోడీ

ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్ స్టార్ డబుల్స్ జోడీ సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఇవ్వాల జరిగిన క్వార్టర్‌‌ఫైనల్స్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన ప్రపంచ సుపాక్ జోమ్‌కో – కిట్టినుపాంగ్ కెడ్రెన్‌లపై 21-19, 21-13 వరుస సెట్లలో విజయం సాధించి సెమీస్‌లో బెర్త్ కన్ఫామ్ చేసుకున్నారు. ఇక, తదుపరి మ్యాచ్ లో దక్షిణ కొరియాకు చెందిన కాంగ్ మిన్ హ్యూక్ – సియో సీయుంగ్ జేలతో తలపడనున్నారు.

ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ ప్లేయర్ లక్ష్య సేన్ సింగపూర్ కు చెందిన లోహ్ కీన్ యూ తో తలపడుతన్నాడు. అనంతరం మహిళల డబుల్స్ క్యాటగిరీలో ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ ద్వయం చైనా జోడీ చెన్-జియాతో తలపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement