Saturday, May 25, 2024

ఆంధ్ర వనితా మండలిలో వరలక్ష్మి వ్రతం-కృష్ణాష్టమి వేడుకలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధానిలోని ఆంధ్ర వనితా మండలి(ఏవీఎం)లో సామూహిక వరలక్ష్మి వ్రతం-కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూఢిల్లీలోని ఐటీవోలో ఉన్న ఏవీఎం భవనంలో ప్రధాన కార్యదర్శి అనసూయ, కోశాధికారి సత్యవతి, సంయుక్త కార్యదర్శి పార్వతిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేద మంత్రాల నడుమ పలువురు మహిళలు వరలక్ష్మి వ్రతం, కృష్ణాష్టమి పూజలో పాల్గొన్నారు. అనంతరం మహిళలకు తాంబూలాలు అందజేశారు. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ స్థాపించిన ఆంధ్ర వనితా మండలిలో తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా పండుగలు నిర్వహిస్తుంటామని కార్యవర్గ సభ్యులు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement