Tuesday, May 14, 2024

Uttara Pradesh – బీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు – తీవ్ర బుల్లెట్ గాయాలు

లక్నో – భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది.ఘటన సమయంలో ఆజాద్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాడి చేసిన వ్యక్తులు హర్యానా రవాణా శాఖ నెంబర్ ప్లేట్ వున్న కారులో ఘటనాస్థలికి చేరుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాల్పులు జరిగిన సమయంలో ఆజాద్ టయోటా ఫార్చ్యూనర్‌ కారులో ప్రయాణిస్తున్నారు. వాహనం సీటు , డోర్‌పై బుల్లెట్ గుర్తులు వున్నాయి. దుండగులు వెనుక నుంచి కారు వద్దకు వచ్చి చంద్రశేఖర్ ఆజాద్‌పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు..

ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ శరీరంలోకి దూసుకెళ్లి బయటికి వెళ్లిపోయింది. దాంతో తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. ఆజాద్‌ వెంట ఉన్నవాళ్లు ఆయనను వెంటనే సహరాన్‌పూర్‌లోని సీహెచ్‌సీకి తరలించారు. ప్రస్తుతం ఆజాద్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement