Saturday, April 27, 2024

గుట్కా తిన్న వరుడు.. పెళ్లి ఆపేసిన వధువు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బాలియా జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ముహుర్తం స‌మ‌యంలో వ‌రుడు గుట్కా న‌ములుతున్న విష‌యాన్ని వ‌ధువు గ్ర‌హించింది. దీంతో త‌న‌కు ఈ పెళ్లి వ‌ద్దంటూ వ‌ధువు స్ప‌ష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మిశ్రౌలి గ్రామానికి చెందిన ఓ యువ‌తితో కేజూరి గ్రామ‌వాసికి జూన్ 5న పెళ్లి చేయాల‌ని నిశ్చ‌యించారు. ఆ రోజున పెళ్లి మండ‌పానికి వ‌చ్చిన వ‌రుడు గుట్కా న‌ములుతూ వ‌ధువుకు క‌నిపించాడు. దీంతో త‌న‌కు వ‌రుడు గుట్కా న‌మ‌ల‌డం న‌చ్చ‌లేద‌ని, ఈ పెళ్లి వ‌ద్ద‌ని త‌న త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. ఇరు కుటుంబాల పెద్ద‌లు వ‌ధువుకు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఆమె విన‌లేదు. ఈ క్ర‌మంలో పెళ్లికి ముందు ఇచ్చిపుచ్చుకున్న క‌ట్న‌కానుక‌ల‌ను తిరిగి ఇచ్చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement