Monday, May 6, 2024

ఉన్నావ్​లో మరో ఘోరం.. యూపీ మాజీ మంత్రి కుమారుడి ఇంట్లో దళిత బాలిక మృతదేహం

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మరో ఘోరం జరిగింది. బీఎస్​పీ నేత, మాజీ మంత్రి కుమారుడి ఇంట్లో ఓ బాలిక డెడ్​బాడీ బయటపడింది. కాగా ఆ మృతదేహం 22 రోజుల క్రితం కనిపించకుండా పోయిన దళిత బాలికగా పోలీసులు తెలిపారు. ఆమె పోస్టుమార్టమ్​లో గొంతు నులిమి హత్య చేసినట్లు వెల్లడైంది. మెడ విరిచేసినట్టు అధికారులు తెలిపారు.  రెండు నెలల క్రితం అంటే డిసెంబర్ 8న అదృశ్యమైన 22 ఏళ్ల యువతి మృతదేహాన్ని యూపీ మాజీ మంత్రి కుమారుడు రాజోల్ సింగ్‌కు చెందిన ఆశ్రమం సమీపంలో నిన్న స్వాధీనం చేసుకున్నారు. కుళ్లిపోయిన మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి సెప్టిక్ ట్యాంక్‌లో పడేసినట్టు పోలీసులు తెలిపారు.

పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం.. ఆమెపై లైంగిక దాడి జరిగిందని, తలపై రెండు గాయాలు గమనించినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలి తల్లి ఆరోపించింది. కాగా, జిల్లా ఎస్పీని కలవడానికి అక్కడి అధికారులు పర్మిషన్​ ఇవ్వలేదని ఆమె ఆరోపించింది. ఈ కేసులో యూపీ మాజీ మంత్రి ఫతే బహదూర్ సింగ్ కుమారుడు రాజోల్ సింగ్‌ను విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement