Friday, May 10, 2024

Breaking :జ‌న‌గామ క‌లెక్టరేట్ ని ప్రారంభించిన కేసీఆర్ – ప‌ట్టుబ‌ట్టి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు తెచ్చుకున్నాం

స‌మీకృత క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం ప్రారంభోత్స‌వంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. జ‌న‌గామ‌లో క‌లెక్ట‌రేట్ ని కేసీఆర్ ప్రారంభించారు. ఈ మేర‌కు కేసీఆర్ కి ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు మంత్రులు, అధికారులు. ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ జిల్లా క‌లెక్ట‌రేట్ ని ప్రారంభించారు కేసీఆర్. అనంత‌రం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది. గ‌తంలో జ‌న‌గామ‌ని చూసి ప్రొ.జ‌య‌శంక‌ర్ ఎంతో బాధ‌ప‌డేవారని తెలిపారు. చేలు,చెట్లు ఎండిపోయి దుర్భ‌ర ప‌రిస్థితులు ఉండేవని కేసీఆర్ అన్నారు. మంచినీళ్ల కోసం బిందెలు ప‌ట్టుకుని వెళ్ళేవార‌ని.. ఆ ప‌రిస్థితులు చూసి ఏడ్చాన‌ని తెలిపారు సీఎం. ప‌ట్టుబ‌ట్టి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు తెచ్చుకున్నామ‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement