Sunday, May 5, 2024

అభిమాని కుటుంబాన్ని ఆదుకుంటాం-ట్వీట్ చేసిన బింబిసార టీం

నిన్న హైద‌రాబాద్ లోని శిల్ప‌క‌ళావేదిక‌లో బింబిసార చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది.ఈ ఈవెంట్ లో ఓ అభిమాని మృతి చెందిన విష‌యం తెలిసిందే. కాగా ఈ ఘ‌ట‌న‌పై చిత్ర యూనిట్ స్పందించింది. సాయిరామ్ కుటుంబాన్ని సాధ్య‌మైన విధంగా ..అన్ని ర‌కాలుగా ఆదుకుంటామ‌ని భ‌రోసా ఇచ్చారు బింబిసార చిత్ర యూనిట్. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నటించిన బింబిసార ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఓ అభిమాని మృతి చెందాడు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ గెస్ట్ గా హాజరైన ఈ ఈవెంట్‌కి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో పుట్టా సాయిరామ్‌ అనే అభిమాని కన్నుమూశారు. పిట్స్ వచ్చిన కారణంగా సాయిరామ్‌ పడిపోయాడని, వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్టు తెలుస్తుంది.

వెస్ట్ గోదావరి జిల్లా, పెంటపాడు మండలానికి చెందిన అభిమాని పుట్టా సాయిరామ్‌(సన్నాఫ్‌ రాంబాబు) మృతి పట్ల బింబిసార యూనిట్‌ స్పందించింది. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈవెంట్‌లో దురదృష్ణవశాత్తు అభిమాని మరణించాడనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపింది. పుట్టా సాయిరామ్‌ లేదనేది నిజంగా గుండెపగిలే వార్త. ఈ సందర్భంగా వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు. సాయిరామ్‌ ఎన్టీఆర్‌కి వీరాభిమాని అని తెలుస్తుంది. ఆయన మృతి పట్ల పోలీసులు విచారణ కూడా జరుపుతున్నారని సమాచారం. కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన బింబిసార చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్ పతాకంపై హరి నిర్మిస్తున్నారు. కేథరిన్‌ థ్రెసా, సంయుక్త మీనన్‌ హీరోయిన్లుగా నటించారు. ఆగస్ట్ 5న ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement