Friday, April 26, 2024

గుంటూరులో మంకీపాక్స్ అనుమానిత కేసు

ఏపీలోని గుంటూరు జిల్లాలో మంకీపాక్స్‌ అనుమానిత కేసు నమోదైంది. ఒడిశా నుంచి ఉపాధి కోసం పల్నాడు జిల్లాకు వచ్చిన కుటుంబంలోని బాలుడు (8) ఒంటిపై దద్దుర్లు రావడంతో తల్లిదండ్రులు అతడిని గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. రెండు వారాలు గడుస్తున్నా.. దద్దుర్లు త‌గ్గ‌క‌పోవ‌డంతో వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తూ బాలుడి నమూనాలను సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వచ్చే రిపోర్టు ఆదారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జీజీహెచ్‌ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement