Saturday, April 27, 2024

ఉగాది క‌ళాసుధ‌ పుర‌స్కారాలు..

ఉగాది సందర్భంగా కళాసుధ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 25వ సిల్వర్‌ జూబ్లీ ఉగాది పురస్కారాలను అందించనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు- చేసిన సమావేశంలో సంస్థ అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉగాది రోజున చెన్నైలో పురస్కారాల్ని అందజేయ నున్నాం. ఈ సందర్భంగా ఎంపిక చేసిన 25 మంది అవార్డు గ్రహీతలకు వెండి మెమోంటోలు ప్రధానం చేయాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ గవర్నర్‌ నరసింహన్‌, మండలి బుద్ధప్రసాద్‌, అలీ, పి.సుశీల, నిర్మాత రవిశంకర్‌ (మైత్రి మూవీస్‌) లాంటి ప్రముఖులు హాజరవుతున్నారు. ఉగాది రోజున చెన్నయ్‌లోని మ్యూజిక్‌ అకాడమీలో ఈ వేడుక జరగనుంది అన్నారు. ఈ సమావేశంలో అతిథులుగా ప్రసన్నకుమార్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ , శ్రీనివాస్‌, పర్వతనేని రాంబాబు, మురళి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement