Tuesday, May 14, 2024

జూన్‌ 6న టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష.. 28 నుంచి హాల్‌టికెట్లు జారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ గరుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 35 గురుకుల జూనియర్‌ కాలేజీల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాదిలో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌-2022 ప్రవేశ పరీక్ష జూన్‌ 6న నిర్వహించనున్నారు. అయితే ఈనెల 28వ తేదీ నుంచి విద్యార్థులు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రవేశ పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 40,281 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement