Saturday, April 27, 2024

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం

పాలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు జితేందర్‌రెడ్డి (45) గుండెపోటుతో బుధవారం ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని నివాసంలో ఉదయం పూట టిఫిన్ చేస్తూ ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారని, వెంటనే ఆస్పత్రికి తరలించగా జితేందర్‌రెడ్డి మరణించినట్లు వైద్యులు తెలియజేశారు. కాగా కుటుంబీకులు జితేందర్‌రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామం కూసుమంచి మండలం రాజుపేటకు తరలించారు. ఈ విషయం తెలుసుకుని ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన సోదరుడు మృతి చెందడంతో పలువురు టీఆర్ఎస్ నేతలు ఉపేందర్‌రెడ్డికి ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement