Sunday, May 12, 2024

మేనకోడలిపై తెరాస నేత అత్యాచారం

తెరాస నాయకుల ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు రోజుకో కొత్త ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.తాజాగా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన పదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక పై జిల్లా కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు సయ్యద్ ఆసిఫ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే మైనర్ బాలికకు ఆసిఫ్ మేనమామ కావడంతో ప్రతిరోజు ఇంటికి రాకపోకలు సాగించే వాడు. ప్రతి చిన్న పనికి బైక్ పై కామారెడ్డికి మైనర్ బాలికను తీసుకువెళ్లే వాడు.

సయ్యద్ ఆసిఫ్ బంధువు కావడంతో కుటుంబ సభ్యులు కూడా అనుమానం వ్యక్తం చెయ్యలేదు. గత కొన్ని రోజుల క్రితం మైనర్ బాలిక అస్వస్థతకు గురికావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనితో ఆసిఫ్ పై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలిసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement