Thursday, May 2, 2024

టీ-24 సేవలు.. రూ.100కే సిటీ ప్రయాణం

ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల పరిధిలోని ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. ట్రావెల్‌ 24 అవర్స్‌(టీ-24) పేరిట రూ.100కే ఒకరోజు పాస్‌ జారీ చేయనున్నట్టు ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. ఒక రోజంతా జంటనగరాల పరిధిలో ఏ ప్రాంతానికైనా సిటీ ఆర్డినరీ, సబర్బన్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో ఎన్నిసాైర్లెనా ప్రయాణించవచ్చని తెలిపారు. పెరిగిన పెట్రోలు ధరలతో సతమతమవుతున్న ప్రజలు అత్యంత చౌకలో, సురక్షితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Petrol, Diesel Prices: వాహనదారులకు ఊరట.. స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు

Advertisement

తాజా వార్తలు

Advertisement