Tuesday, May 7, 2024

అన్నా, రాఖీ కడుతా లేవు.. పండుగపూట చెల్లెలికి పుట్టెడు దు:ఖం!

నర్సాపూర్, (ప్రభ న్యూస్) : రాఖీ పండుగ వేళ… ఒక్కగానొక్క అన్నకు రాఖీ కట్టాలని బయలుదేరి వచ్చారు ఆ అక్క చెల్లెలు.. ఇంటికి చేరుకోగానే పిడుగు లాంటి మరణ వార్త వినవలసి వచ్చింది. రాఖీ కట్టడానికి అన్న లేడని తెలిసి గుండెలసెల ఏడ్చారు. అన్నా… లేవు రాఖీ కడతాము. అంటూ ఆ చెల్లెలు ఇద్దరు చేసిన రోదనలు అక్కడి వారందరని కలిచివేసాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా ఆవంచ గ్రామంలో గురువారం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆవంచ గ్రామానికి చెందిన కొండి జగన్ 45 సంవత్సరాలు అనే వ్యక్తి అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా బాధపడుతూ ఉన్నాడు. .

అయితే గురువారం మధ్యాహ్నం సుమారు మూడు గంటల ప్రాంతంలో అస్వస్థత గురై మృతి చెందాడు .కాగా రాఖీ పండుగను పురస్కరించుకొని జగన్ కు తన ఇద్దరి చెల్లెలు నరసమ్మ ,అంబికలు ఉన్నారు అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చిన సంతోషంతో వచ్చిన చెల్లెళ్లకు విషాదం ఎదురయింది సంతోషంగా రాఖీ కడదామని వస్తే మాకు లేకుండా పోయావా అన్న అంటూ మృతదేహం వద్ద రోదిస్తుండడంతో గ్రామంలోని పలువురు కంటతడి పెట్టారు దీంతో ఆవంచ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి…..

Advertisement

తాజా వార్తలు

Advertisement