Sunday, April 28, 2024

ఢిల్లీ రూట్​లో ట్రాఫిక్​ జామ్​.. 10కిలో మీటర్ల మేర నిలిచిన వాహనాలు

ఢిల్లీ-లక్నో NH9 హైవేపై సోమవారం పెద్ద ఎత్తున ట్రాఫిక్​ జామ్​ అయ్యింది. సోమవతి అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు గర్ గంగా చేరుకున్నారు. భారీ వాహనాలను రూట్‌ మళ్లించినప్పటికీ జాతీయ రహదారిపై  ట్రాఫిక్​ జామ్‌ ఏర్పడింది.  దీంతో భక్తులతోపాటు ప్రయాణికులు గంటల తరబడి చిక్కుకున్నారు.  ట్రాఫిక్​ను అదుపు చేయడంలో పోలీసు యంత్రాంగం విఫలం కావడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు.

భక్తుల్లో ఒకరు మీడియాతో మాట్లాడుతూ  “మీరు ఈ రోజు ఢిల్లీ నుండి లక్నోకు వెళ్లాలనుకుంటే అమ్రోహా సమీపంలోని గర్ గంగాలో స్నానాలు చేస్తున్న భక్తుల రద్దీ కారణంగా గంటల తరబడి చిక్కుకుపోవచ్చు. అక్కడ 10- కి.మీ పొడవునా ట్రాఫిక్​ నిలిచిపోయింది. ఈ సమయంలో పోలీసులు దానినిసరిచేయడంలో  పూర్తిగా విఫలమైనట్లు కనిపిస్తోంది. అందరూ ట్రాఫిక్​లో చిక్కుకుపోయారు” అని పేర్కొన్నాడు .

Advertisement

తాజా వార్తలు

Advertisement