Monday, May 6, 2024

తెలంగాణ ఇవాళ రేపు భారీ వర్షాలు..

రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం రాత్రి వరకు రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అయిజలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పిడుగుపాటు కారణంగా వేర్వేరు చోట్ల నిన్న ముగ్గురు మృత్యువాతపడ్డారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టలో కొమ్ము సాయమ్మ (50), కొమ్ము అమరేశ్వరి (28), ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపానిలో వేపల ఎల్లమ్మ (30) పిడుగుపడి మృతి చెందారు. ఈ ఘటనలో మరికొందరు కూడా గాయపడ్డారు. వరంగల్ రూరల్ జిల్లా, సంగెం మండలంలో ఓ శవయాత్రపై పిడుగు పడడంతో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు.

ఇది కూడా చదవండి: టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి..

Advertisement

తాజా వార్తలు

Advertisement