Monday, April 29, 2024

Kakinada: పామాయిల్‌ తోటలో.. విద్యుత్ షాక్ తో ముగ్గురి మృతి

జగ్గంపేట: పామాయిల్ తోట‌లో విద్యుత్ షాక్ త‌గిలి ముగ్గురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గండేపల్లి మండలంలోని ఉప్పలపాడులో విషాద ఘ‌ట‌న‌ నెలకొంది.

పామాయిల్‌ తోటలో వ్యవసాయ బోరుకు మరమ్మతులు చేస్తుండగా, విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృతి చెందారు. పొలంలోని విద్యుత్ తీగలు పైపులకు తగలడంతో వీరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను బోదిరెడ్డి సూరిబాబు (35), కిల్లినాడు (40), గల్ల బాబీ (24)గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement