Monday, May 6, 2024

TSPSC: గ్రూప్ – 1 ప్రిలిమ్స్ రద్దు చేసిన హైకోర్టు..

హైదరాబాద్‌: తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. జూన్‌ 11న జరిగిన ఈ పరీక్షకు 2.32 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. మొత్తం 503 పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్ష జరిగింది. అయితే, పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్‌లు వేశారు. హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. తిరిగి కొత్త నో్టిఫికేషన్ తో పరీక్ష నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement