Saturday, April 27, 2024

Drowned – చెరువులో ముగ్గురు సఫాయి కార్మికులు గ‌ల్లంతు

గజ్వేల్ అక్టోబర్ 14( ప్రభ న్యూస్) సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లోని జగదేవపూర్ మండలం తిగుల్ గల పఠాన్ చెరువులో ముగ్గురు సఫాయి కార్మికులు గల్లంతయ్యారు. బతుక‌మ్మ‌ మెట్లను శుభ్రం చేస్తున్న క్రమంలో చెరువులో పడ్డారు. వెంట‌నే స్థానికులు ర‌క్షించే ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లించ‌లేదు.. చెరువులో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.. దీనిపై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement