Wednesday, May 8, 2024

చిత్తూరు జిల్లాలో విషాదం.. చెరువులో బయటపడ్డ మూడు మృతదేహాలు

చిత్తూరు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. మూడు మృతదేహాలు చెరువులో తేలుతూ కనిపించాయి. రామచంద్రాపురం మండలం సీ.రామాపురంలో ఘటన వెలుగు చూసింది. అన్నస్వామి గండిచెరువు క్వారీ గుంతలో గుర్తు తెలియని మహిళ, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు నీటిపై తేలుతూ కనిపించాయి. మృతులు తల్లీ పిల్లలుగా భావిస్తున్నారు. అలాగే క్వారీ గుంతకు సమీపంలోని కంపోస్టు యార్డులో ద్విచక్ర వాహనం లభ్యమైంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఆత్మహత్యా? హత్యా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతులను పెనుమూరు మండలం గుండ్యానంపల్లె గ్రామానికి చెందిన నీరజ (32), చందు (8), చైత్ర (2)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement