Tuesday, May 7, 2024

ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌

ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్ట్‌కు వేదిక ఖరారైంది. ఆ మ్యాచ్‌ను మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో నిర్వహించనున్నారు. వాస్తవానికి ఈ మ్యాచ్‌ ధర్మ శాలలో జరగాల్సి ఉంది. కానీ వేదికను మార్చారు. ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంలో జరగనున్నట్లు సోమవారం బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరగాల్సిన ఆ మ్యాచ్‌ను ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంకు మార్చినట్లు జైషా తెలిపారు.

షెడ్యూల్‌ ప్రకారం మార్చి 1న ధర్మశాల వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్‌ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆ ప్రాంతంలో శీతాకాల ఊష్ణోగ్రతలు అత్యంత కనిష్టంగా ఉన్నాయని, ఔట్‌ ఫీల్డ్‌లో కావాల్సినంత గడ్డి లేదని బీసీసీఐ కార్యదర్శి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement