Monday, May 6, 2024

ఇంటర్‌ ఆన్‌లైన్‌ వ్యాల్యూయేషన్‌కు మరోసారి.. టెండర్లు స్వీకరణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు, అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ, రీవ్యాల్యూయేషన్‌ పరీక్ష జవాబు పత్రాల ఆన్‌లైన్‌ మూల్యాంకనం కోసం నిర్వహించిన టెండర్లు ప్రక్రియ క్యాన్సిల్‌ అయ్యింది. ఓ సంస్థకు చెందిన బిడ్డర్‌ ఒక్కరే టెండర్‌ దాఖలు చేయడంతో మరోసారి టెండర్‌ ప్రక్రియను చేపట్టనున్నట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ జయప్రదాబాయి తెలిపారు.

సోమవారం టెండర్‌ పత్రాలను తెరవగా అందులో మ్యాగ్నటిక్‌ ఇన్‌ఫోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ పేరుతో ఒక్కటే టెండర్‌ దాఖలైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈమేరకు ఈ ప్రక్రియను మరోసారి చేపట్టనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement