Friday, April 26, 2024

బొలెరోను ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్.. ఇంజ‌న్ దెబ్బతిని లిచిపోయిన రైలు..

దురంతో ఎక్స్‌ప్రెస్ బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన ఘ‌ట‌న ఏలూరు జిల్లా భీమడోలు వద్ద తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో బొలెరో వాహ‌నం పూర్తిగా ధ్వంసం కాగా.. రైలు ఇంజిన్ దెబ్బతింది. దీంతో దాదాపు ఐదు గంటలుగా రైలు ట్రాక్‌పైనే నిలిచిపోయింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన రైల్వే అధికారులు మరో ఇంజిన్ తీసుకొచ్చి రైలుకు అమర్చి పంపేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి… దురంతో ఎక్స్‌ప్రెస్ వస్తుండడంతో భీమడోలు జంక్షన్ వద్ద సిబ్బంది రైల్వే గేటును మూసివేయ‌గా.. బొలెరో వాహనంలో వచ్చిన కొందరు వ్యక్తులు గేటును ఢీకొట్టి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వాహనం సరిగ్గా రైల్వే ట్రాక్‌పైన ఆగిపోయింది. అదే సమయంలో రైలు దూసుకొస్తుండడంతో వారు వాహనం దిగి పరారయ్యారు. వేగంగా వచ్చిన రైలు వాహనాన్ని ఢీకొని ఆగిపోయింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ట్రాక్‌పై నుంచి బొలెరోను తొలగించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు వాహనంలో వచ్చింది ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు. పరారైన దుండగుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement