Thursday, April 18, 2024

నందికొట్కూరు లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

నందికొట్కూరు, మార్చి 30, (ప్రభ న్యూస్) : నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో కర్నూల్ గుంటూరు రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరొక యువకుడు మృత్యువుతో పోరాడుతున్న సంఘటన చోటుచేసుకుంది. నందికొట్కూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు దీపక్, మదు, జనార్దన్ లు నందికొట్కూరు నుండి కర్నూలుకు పనుల నిమిత్తం వెళ్తున్నారు.

అయితే బ్రాహ్మణకొట్కూరు దాటిన తరువాత ముందుగా వెళ్తున్న ట్రాక్టర్ ను తప్పించబోయి ప్రమాదవ శాత్తూ బైక్ అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో జనార్దన్ (24), దీపక్ (26) లు అక్కడికక్కడే మృతిచెందగా మధు (23) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న బ్రాహ్మణకొట్కూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన మధును కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, మృతిచెందిన వారి మృతదేహాలను నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. యువకుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఓబులేష్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement