Wednesday, May 8, 2024

మందు పాతరను నిర్వీర్యం చేసిన పోలీసులు

ములుగు, ప్రభన్యూస్ ప్రతినిధి : వెంకటాపురం మండలం పామునూరు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందు పాతరను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఏటూర్ నాగారం ఏఎస్సీ సంకీర్త్ సోమవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.పామునూరు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులను హతమార్చేందుకు మావోయిస్టులు ఈనెల 17న మందు పాతర అమర్చినట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు వెంకటాపురం సిఐ కాగితోజు శివ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్పై తిరుపతి రావు సీఆర్పీఎఫ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ, బాంబు డిస్పోజల్ టీం తో కలిసి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు తెలిపారు.

అటవీ ప్రాంతంలో బాంబ్ ను గుర్తించేందుకు కూంబింగ్ చేస్తుండగా రోడ్డుపై విద్యుత్ తీగ కనిపించడంతో దాన్ని పరిశీలించుకుంటూ వెళ్లగా అటవీ ప్రాంతంలో బీర్ బాటిల్ బాంబును గుర్తించారని తెలిపారు.వెంటనే బాంబు డిస్పోజల్ బృందాలు బాంబ్ ను నిర్వీ ర్యం చేసినట్లు తెలిపారు. బాంబ్ ను అమర్చిన మావోయిస్టు అగ్రనేతల పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement