Saturday, April 27, 2024

మనోహర్ రెడ్డికి లైన్ క్లియర్… సీఎం సభ విజయవంతంతో కేడర్ లో జోష్..

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కి లైన్ క్లియర్ అయింది. సీఎం కేసీఆర్ పెద్దపల్లి జిల్లా పర్యటనలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి లభించిన ప్రాధాన్యత చూసిన వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద మనోహర్ రెడ్డికి ఉన్న ప్రాముఖ్యత తెలియజేసింది. జిల్లా కేంద్రానికు సీఎం కేసీఆర్ చేరుకున్నప్పటి నుండి పర్యటన ముగిసే వరకు సీఎం మనోహర్ రెడ్డికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. హెలిప్యాడ్ మొదలుకొని పార్టీ కార్యాలయం కలెక్టరేట్ ప్రారంభోత్సవాలు, బహిరంగ సభ వద్ద ఆయన పేరే ప్రస్తావించడం కేసీఆర్ మదిలో దాసరి తప్ప మరెవరు లేరనే విషయాన్ని తెలియజేసింది. ఎమ్మెల్యే దాసరి నివాసంలో భోజనం చేసిన సీఎం అధిక సమయం అక్కడే కేటాయించడం, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగి సరదాగా గడిపారు. ముఖ్యమంత్రి హాజరైన బహిరంగ సభలో సైతం ఒక్క మనోహర్ రెడ్డికే మాట్లాడే అవకాశం ఇవ్వడం విశేషం. పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో గొప్పగా కట్టావ్ మనోహర్ అని సీఎం ఎమ్మెల్యే ను అభినందించారు. సీఎం పర్యటనలో మనోహర్ రెడ్డికి అధిక ప్రాధాన్యత లభించడంతో దాసరి అనుచరుల్లో నూతన ఉత్తేజం నెలకొంది. మూడోసారి టికెట్ దాసరికేనని వచ్చే ఎన్నికల్లో మనోహర్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధిస్తారని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో దాసరిని పక్కన పెడతారని తమకే టికెట్ దక్కుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్న నాయకుల్లో తీవ్ర నిరాశ నింపింది. కేసీఆర్ జిల్లా పర్యటనతో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ వద్ద మనోహర్ రెడ్డి తప్ప మరి ఎవరికి చోటు లేదని స్పష్టమైంది. బహిరంగ సభ భారీ స్థాయిలో విజయవంతం కావడంతో గులాబీ దండులో ఉత్తేజం నిండింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement