Friday, May 24, 2024

కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన కీలక సమావేశం..

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ, కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరినీ కేసీఆర్ అభినందించనున్నారని తెలుస్తోంది. అదేవిధంగా పార్టీ బలోపేతంపై గులాబీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement