Friday, April 26, 2024

స‌ర్కార్ మూవీ నాలుగో పార్ట్.. అప్ డేట్ ఇచ్చిన నిర్మాత‌

స‌ర్కార్ చిత్రానికి నాలుగోభాగం రూపొంద‌నుంది.2005లో తొలి చిత్రం ‘సర్కార్‌’, 2008లో ‘సర్కార్‌ రాజ్‌’, 2017లో ‘సర్కార్‌ 3’ చిత్రాలు రూపొందాయి. ఈ మూడు చిత్రాలకూ రామ్ గోపాల్ వ‌ర్మ‌నే దర్శకత్వం వహించారు. ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్కార్ కి సంబంధించి మూడు పార్టులు తెర‌కెక్కాయి. కాగా నాలుగో భాగాన్ని తెర‌కెక్కిస్తామ‌ని నిర్మాత ఆనంద్ పండిట్ వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కార్‌ ఫ్రాంఛైజీని ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నాం.

త్వరలో ‘సర్కార్‌ 4’ ఉంటుంది. అలాగే అభిషేక్‌ బచ్చన్‌తో మేం నిర్మించిన ‘బిగ్‌ బుల్‌’ చిత్రానికీ సీక్వెల్‌ నిర్మించబోతున్నాం. ఈసారి మరో కొత్త తరహా ఆర్థిక నేరాన్ని కథాంశంగా ఎంచుకుంటాం. ఒక పుస్తకం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని చెప్పారు. సినీ ప్రియులకు ఫేవరేట్‌ మూవీ ‘సర్కార్‌’. బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కెరీర్‌లో ఇదొక ప్రత్యేక చిత్రంగా మిగిలిపోయింది. దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు పేరే తెచ్చిన సినిమాగా నిలిచింది స‌ర్కార్.ఈ చిత్రంలో అమితాబ్‌, అభిషేక్‌ బచ్చన్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement