Wednesday, March 27, 2024

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని స‌న్నిదిలో భ‌క్తుల సంద‌డి నెల‌కొంది. స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు కంపార్ట్ మెంట్ల‌లో భ‌క్తులు వేచిఉన్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 4 గంటల సమయం పడుతోంద‌ని అధికారులు తెలిపారు. బుధవారం శ్రీవారిని 71,924 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.13 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 15,771 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement