Saturday, April 27, 2024

మోడీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతుంది : కేంద్ర మంత్రి రూపాల

చెన్నూర్, (ప్రభ న్యూస్) : సమర్థ వంతమైన ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు తొమ్మిదేళ్ళ మహా సంపర్కఅభియాన్ కార్యక్రమంలో బాగంగా గురువారం చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పశుసహర్థక మంత్రి పురుషోత్తం రూపాల హాజరై ప్రసంగించారు తెలంగాణ రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం అనేకనిధులు మంజూరు చేసిందని అన్నారు. 2014 ముందు దేశంలో అవినీతి మాత్రమే ఉండేదన్నారు.

9 ఏళ్ళ మోదీ పాలనలో ఒక్కరు కూడా అవినీతి గురించి మాట్లాడే దైర్యం లేదన్నారు తెలంగాణ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు విముఖతతో ఉన్నరనీ డబుల్ బెడ్రూం పేరుతో ప్రజలకు మోసం జరింగిందన్నరు. తెలంగాణ ఖజానా ఖాళీ చేసి ఇతర రాష్ట్రలో ప్రచారానికి ఖర్చు అవుతున్నాయని అన్నారు. ఎంతో ప్రాధాన్యత కల్గిన చెన్నూరు ఉత్తరవహినీ గోదావరి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు దేశంలో బిజెపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరంచలన్నారు కరోనా కాలంలో ప్రజలు అల్లాడి పోతుంటే ఇతర దేశాలకన్న ముందు జాగ్రత్త వహించి ప్రజలకు సేవలు అందేలా కృషిచేసిన ఘనత ప్రదనికే దక్కిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement