Thursday, May 9, 2024

Big Breaking | ఐదేళ్ల బాలుడిపై చిరుతపులి దాడి.. తిరుమలలో ఘటన

తిరుమల నడక మార్గంలో ఘోరం జరిగింది. ఏడో మైలురాయి వద్ద ఓ చిన్నారి బాలుడిపై ఇవ్వాల (గురువారం) రాత్రి చిరుత దాడి చేసింది. ఐదు సంవత్సరాల బాలుడిని చిరుత ఎత్తుకెళ్తుంటే అక్కడే డ్యూటీలో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. చిరుతను చూసి గట్టిగా కేకలు వేశారు. వారి అరుపులకు చిరుత భయపడి బాలుడిని వదిలేసి వెళ్ళింది. చిరుత దాడిలో ఆ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఘటనా స్థలికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి చేరుకొనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement