Sunday, May 19, 2024

దేశంలో కరోనా కాటుకు 24 గంటల్లో 4209 మంది మృతి

దేశంలో కరోనా కేసులు గత కొన్నిరోజులుగా అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,59,591కేసులు న‌మోదుకాగా ఈ మహమ్మారి దెబ్బకు 4,209మంది మృతి చెందారు. ఇక కొత్త‌గా మ‌రో 3,57,295మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక దేశంలో ప్ర‌స్తుతం 30,27,925యాక్టివ్ కేసులున్నాయి. మ‌ర‌ణాల సంఖ్య 2,91,331కు చేరింది.అలాగే మొత్తం దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 2,60,31,991మందికి పాజిటివ్ రాగా 2,27,12,735మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో అత్య‌ధికంగా త‌మిళ‌నాడులో 35,579, కేర‌ళ 30,491, మ‌హారాష్ట్ర 29,911, క‌ర్ణాట‌క 28,869, ఏపీలో 22,610కేసులొచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement