Saturday, May 4, 2024

పసికందు ప్రాణం తీసిన చైన్ స్నాచర్…!

జనగామ : జనగామ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తల్లి తన పాపతో బయటకు వచ్చింది. ఈ క్రమంలో చైన్ స్నాచర్స్ ఆమె మెడలో ఉన్న గొలుసును దొంగిలించేందుకు యత్నించగా.. చేతిలో ఉన్న పాప జారిపడిపోయింది. ఈ ఘటనలో ఆ పసికందు మృతి చెందింది. దీంతో స్థానికంగా విషాధచాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. జనగామ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ప్రసన్న అనే మహిళ పది నెలల పాపను ఎత్తుకొని ఉండగా బైక్ పై దుండగుడు మెడలో ఉండే బంగారాన్ని దొంగిలించే ప్రయత్నం చేశారు. ఈ క్ర‌మంలో త‌ల్లి త‌న పసిపాపను సంపులో పడేసింది.. దీంతో ఆమె కన్నీరు మున్నీరవుతుండ‌గా చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని పాప‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గం మధ్యలోనే మృతి చెందింది. పోలీసులు అప్రమత్తమై దుండగుని కోసం నిఘా నేత్రాలను గాలింపులు చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement