Wednesday, May 8, 2024

రాజభవనంలో రాక్షసానందం పొందుతున్న తాలిబన్లు..

అఫ్ఘ‌నిస్తాన్‌లో ప్రస్థుత పరిస్థితులను చూసి ప్రపంచం జాలి చూపిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందేమోనన్న భయంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎవ‌రు ఎటునుంచి వ‌చ్చి కాల్పులు జ‌రుపుతారో… ఎవ‌ర్ని ఎత్తుకుపోయి చంపేస్తారో.. ఏ మ‌హిళ క‌నిపిస్తే ఏం చేస్తారో అని భ‌యాందోళ‌నల మ‌ధ్య కాలం వెల్ల‌బుచ్చుతున్నారు. ఇక కాబుల్ నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న తాలిబన్లు విచ్చలవిడిగా తిరుగుతు రాక్షసానందం పొందుతున్నారు. పార్కులు వెంట తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.  నిన్న‌టి రోజున అధ్య‌క్షుడి భ‌వ‌నంలోకి ప్ర‌వేశించిన తాలిబ‌న్లు అక్క‌డ ఫుల్‌గా తినేసి ఎంజాయ్ చేశారు. ఇక ప్రెసిడెంట్ జిమ్ లోకి వెళ్లి ఎదో కొత్త లోకం లోకి వెళ్లినట్లు వెకిలి చేస్టలు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఒక మరి కొంత‌మంది న‌గ‌రంలోని అమ్యూజ్‌మెంట్ పార్క్‌ల‌కు వెళ్లి అక్క‌డ ట్రాయ్ కార్ల‌లో తిరుగుతూ, చెక్క గుర్రాల‌పై రౌండ్లు వేస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబందించిన దృశ్యాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

https://twitter.com/IndiaAheadNews/status/1427561611653308422

ఇది కూడా చదవండి: తాలిబ‌న్లు చంపినా దేశం వ‌దిలి వేళ్లను: మేయర్ జ‌రీఫా

Advertisement

తాజా వార్తలు

Advertisement