Thursday, April 25, 2024

లోకేష్‌తో హైడ్రామా.. సీఎంకు సవాల్ విసరడమేంటి?

విద్యారంగంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అనేక సంస్కరణలు చేపట్టారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఓట్లు లేకపోయినా విద్యార్థులకు అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. పథకాలను పక్కదోవ పట్టించడానికే బాబు.. లోకేష్‌ను పంపి హైడ్రామా చేయించాడని మండిపడ్డారు.

వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు బయట తిరుగుతుంటే ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేసే వారు ఇలానే పెట్రేగిపోతారని వ్యాఖ్యానించారు. మహిళను హత్య చేసిన వాడికి చంద్రబాబుకి తేడా లేదన్నారు. గుంటూరు ఘటన జరిగిన 12 గంటల్లో నిందితుడిని పట్టుకున్నారని.. దిశా చట్టం తెచ్చి మహిళలకు రక్షణ కల్పిస్తున్నారన్నారు. దళిత మహిళ చనిపోతే లోకేష్ శవ రాజకీయాలు చేశాడని దుయ్యబట్టారు. ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు ఎందుకు పరామర్శించలేని మంత్రి నాని ప్రశ్నించారు. లోకేష్ ప్రతిపక్ష నాయకుడా…చంద్రబాబా ? అని అడిగారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్‌ సీఎంకు సవాల్ విసరడమేంటని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement