Friday, May 17, 2024

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు గుండెపోటు

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయనను పరామర్శించిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు వరపుల సుబ్బారావు, రామకృష్ణారెడ్డి, గన్ని కృష్ణ, రాజా, ఎస్వీఎస్ అప్పలరాజు ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా జ్యోతులను పరామర్శించారు. మరోవైపు నెహ్రూకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం జ్యోతుల నెహ్రూ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి: లోకేష్‌తో హైడ్రామా.. సీఎంకు సవాల్ విసరడమేంటి?

Advertisement

తాజా వార్తలు

Advertisement