Sunday, April 28, 2024

నేడు టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈ రోజు (ఈనెల 7న) పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

జూన్‌ 14 నుంచి 22 వరకూ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 60 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు కూడా రెండుమూడు రోజుల్లో విడుదల కానున్నాయి. జూన్‌ 12 నుంచి 20 వరకు ఈ పరీక్షలు జరగ్గా, 4,12,325 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement